కారేపల్లిలో జరిగిన ప్రమాదంలో రెండుకు చేరిన మృతుల సంఖ్య
ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన ప్రమాదంలో రెండుకు చేరిన మృతుల సంఖ్య. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది. కారేపల్లిలో బీఆర్ఎస్ సమ్మేళనంలో ఘోర ప్రమాదం. కాల్చిన బాణాసంచా ఎగిరిపడి గుడిసెకు నిప్పు అంటుకుంది. బాంబు తరహాలో పేలిన గుడిసెలోని సిలిండర్పేలింది. బీఆర్ఎస్ కార్యకర్తలు, జర్నలిస్టులు, పోలీసులకు గాయాలయ్యాయి. కాళ్ళు తెగి ఒకరు, నెత్తురు కారుతూ మరికొందరు ఉన్నారు. చిద్రమైన శరీర భాగాలతో భీతావహంగా మారిన కారేపల్లి. ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం ఇది.