నేడు హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన
ముద్ర,తెలంగాణ బ్యూరో:- తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో కొత్త భవనాలను నిర్మించనున్నారు.శంకుస్థాపన కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.