రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  • అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బి.ఆర్.ఎస్ నాయకులు నియోజకవర్గంలో తిరగలేరు
  • కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో జరిగిన బి ఆర్ ఎస్ సమావేశంలో మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ లు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని మాజీ మంత్రి ఆర్డీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాయకులు లూటీ చేసి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ వారిదేనని, ఓటమిని జీవించుకోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ లకు లేదన్నారు. వారు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని, లేనియెడల నియోజకవర్గంలో వారిని తిరగనియ్యమని హెచ్చరించారు

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమలప్రగడ కిషన్ రావు, ఓరుగంటి సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొండ రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పుల రాంబాబు, నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ రామడుగు నవీన్, నాయకులు కుంచాల ప్రవీణ్ రెడ్డి, మండల మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి అబ్దుల్, అక్కినపల్లి నరేష్, గుగులోతు భాస్కర్, దేవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.