లారీ దగ్ధం

లారీ దగ్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ మీదుగా వెళుతున్న 44 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధం అయింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీని వెనుకగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. దీంతో ముందు వెళుతున్న లారీ లో మంటలు రేగి పూర్తిగా దగ్ధం అయింది. మంటలు అంటుకోగానే డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. హైవే భద్రతా సిబ్బంది మంటలు ఆర్పే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది.