సభను విజయవంతం చేయాలి

సభను విజయవంతం చేయాలి

 రామకృష్ణాపూర్,ముద్ర : ఆగస్ట్ 26,27 తేదీలలో గోదావరిఖని వేదికగ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏ ఐ టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ పిలుపునిచ్చారు. గురువారం రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఆవరణలో కార్మికులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకే సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నూతన ఫిట్ కమిటీని కార్మికులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లింగయ్య, వెంకటేశ్వర రెడ్డి,రమేష్, బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు, సహాయ కార్యదర్శి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.