సంఘ భవనాలకు నిధుల మంజూరి పత్రాలు అందించిన మంత్రి 

సంఘ భవనాలకు నిధుల మంజూరి పత్రాలు అందించిన మంత్రి 

ముద్ర, గొల్లపల్లి : ధర్మపురి నియోజక వర్గ పరిధిలోని సంఘ భవనాలకు మంజూరి అయిన  నిధుల పత్రలను కుల సంఘ సభ్యులు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. గొల్లపల్లి మండలం శ్రీ‌ రాములపల్లె ముదిరాజ్ సంఘ భవనం నిర్మాణానికి రూ . 5 లక్షలు  నిధులు, గంగ పుత్ర సంఘ భవనం నిర్మాణానికి రూ. 2 లక్షల, ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ సంఘం భవనం ( మాదిగ ) నిర్మాణానికి  రు.10 లక్షల నిధులు మంజూరు చేస్తూ మంజూరీ పత్రాలను కుల సంఘాల సభ్యులకు మంత్రి అందించారు.

అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన గుజ్జేటి రవి రోడ్డు ప్రమాదంలో మరణించగా, బిఆర్ఎస్ పార్టీ నుండి సభ్యత్వం ఉండడంతో   ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు అయిన 2 లక్షల చెక్కును  ఆయన భార్య లక్ష్మికీ  మంత్రి అందజేశారు.