నూతన ప్రెస్ క్లబ్ పాత ప్రెస్ క్లబ్ లో విలీనం

నూతన ప్రెస్ క్లబ్ పాత ప్రెస్ క్లబ్ లో విలీనం
  • రెండుగా వీడి.. ఒక్కటైన మిత్రులు..
  • సంఘాలకు అతీతంగా తంగళ్లపల్ల ప్రెస్​ క్లబ్​

ముద్ర, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జర్నలిస్టులు కొన్ని కారణాలతో వీడిపోయి.. రెండవ ప్రెస్​ క్లబ్​ను ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది పాటు ఇలానే కొనసాగాయి. జర్నలిస్టుల మధ్య ఐక్యత చెడిపోతే బాగుండదన్న పెద్దల సలహాతో నూతన ప్రెస్ క్లబ్ పాత ప్రెస్ క్లబ్ లో విలీనమైనట్టు రెండు ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు ఆంజనేయులు, రాజశేఖర్ తెలిపారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు... ఇప్పటినుండి నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ పాత ప్రెస్ క్లబ్ లో విలీనం అవుతూ అందులో సభ్యులుగా కొనసాగుతారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుత తంగళ్లపల్లి ప్రెస్​ క్లబ్​ లో టీయుడబ్యుజే, టీయుడబ్యుజే(143), ఇతర సంఘాల కు సంబంధించి అందరు కలిసి సంఘాలకు అతీతంగా తంగళ్లపల్లి ప్రెస్​ క్లబ్​ లో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై కలసికట్టుగా పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తామన్నారు.