ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చెయ్యాలి

ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చెయ్యాలి

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చెయ్యాలని ముదిరాజ్ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ముదిరాజు సంఘం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల, మండలాల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు పార్టీలకు అతీతంగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారబోయిన రవి ముదిరాజ్, ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సోమ మల్లయ్య ముదిరాజ్, పందిరి శ్రీనివాస్ ముదిరాజ్, కావలి ఆంజనేయులు ముదిరాజ్, ఈటెల వెంకటేశ్వర్లు ముదిరాజ్, నారబోయిన రవి ముదిరాజ్, బోళ్ల వెంకట్ ముదిరాజ్, లోకనబోయిన రమణ ముదిరాజ్, నాశ బోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్, సంగెపు సురేష్ ముదిరాజ్, కట్టా సుధాకర్ ముదిరాజ్, పందిరి దినేష్ కుమార్ ముదిరాజ్, తలారి యాదగిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.