కంట్లో కారం చల్లి మహిళా మెడలో నుంచి గొలుసును లాకెళ్లిన దుండగుడు

కంట్లో కారం చల్లి మహిళా మెడలో నుంచి గొలుసును లాకెళ్లిన దుండగుడు
ముద్ర, వీపనగండ్ల:-పొలం వద్దకు మేతకు తీసుకువెళ్లిన పాడి గేదెలను సాయంకాలం ఇంటికి తోలుకొని వస్తుండగా, దుండగుడు మహిళా రైతు కంట్లో కారం చల్లి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కిలిన ఘటన వీపనగండ్ల మండల సమీపంలోని గుమ్మడం శివారులో  చోటు చేసుకుంది. బాధితురాలి కథన ప్రకారం వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన రామేశ్వరి అనే మహిళా రైతు పాడి గేదెలను ఎప్పటిలాగే ఉదయం వేళ మేతకు తీసుకువెళ్ళింది, సాయంకాలం చీకటి అవుతున్న వేళ పాడి గేదెలను ఇంటికి తోలుకొస్తున్న ఆ మహిళను ఓ దుండగుడు( గుర్తు తెలియని వ్యక్తి) వచ్చి తాను మీ మామిడి తోటను కౌలుకు తీసుకోవటానికి గత మూడు రోజుల క్రితం మరో వ్యక్తితో కలిసి వచ్చానని చెబుతూ  మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. ప్రతిఘటించటంతో దుండగుడు మహిళా రైతు కంట్లో కారం చల్లి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లినట్లు వాపోయింది. జరిగిన ఘటనపై వీపనగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చోరీ జరిగిన ఘటన గుమ్మడం శివారులో జరిగిందని, పెబ్బేరు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బాధితురాలికి తెలిపారు.