జిపి కార్మికులను వేతనాలు పెంచాలి - డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ

జిపి కార్మికులను వేతనాలు పెంచాలి - డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలు రోగాల బారిన పడకుండా అహర్నిశలు కృషి చేసే గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి శ్రమకు తగిన వేతనాలు పెంచాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బోల్లేపల్లి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో జిపి కార్మికులు చేస్తున్న సమ్మెకు గురువారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి వేతనాలు పెంచి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జఫర్గడ్ మండల మాజీ జడ్పిటిసి పట్టాపూరి సదయ్య, ధర్మసాగర్ మండల మాజీ అధ్యక్షులు తూటి నరసింహ రెడ్డి, స్టేషన్గన్పూర్ సీనియర్ నాయకులు చింత దేవదాస్, జనగామ జిల్లా ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ కోల శ్రీనివాస్, స్టేషన్గన్పూర్ మండల ఉపాధ్యక్షులు కుంభం ఉపేందర్, మండల సీనియర్ నాయకులు నీల లింగం, ఎర్రము శ్రీను, శివునిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నీలరాములు, శివునిపల్లి గ్రామ మైనార్టీ నాయకులు షాకీర్, నమిలిగొండ నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.