గంగుల గెలుపు కోసం ఊరంతా ప్రమాణం

గంగుల గెలుపు కోసం ఊరంతా ప్రమాణం
  • యాదాద్రిలో బద్దిపల్లి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం
  • నెట్టింట వీడియో వైరల్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను 4వ సారి శాసన సభ్యులుగా గెలిపించుకుంటామని కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం  బద్దిపల్లి  గ్రామస్థులు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రమాణం చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర ఆధ్వర్యంలో  కంకణదారులయ్యారు. గంగుల కమలాకర్ కు మంత్రిగా అవకాశం రావడం తమ అదృష్టమని మళ్ళీ  తిరుగులేని మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ప్రతినబూనారు.  మొత్తం బద్దిపల్లి గ్రామంలోని ఓట్లన్ని కమలాకర్ కే అంటూ తీర్మాణం చేశారు. 

ప్రస్తుతం బద్దిపల్లి గ్రామస్థులు చేసిన ప్రమాణానికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కరీంనగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ది చేస్తుండడంతో  హైదరాబాద్ తర్వాత 2వ నగరంగా నిలిచిందన్నారు. అభివృద్దికి కెరాఫ్ అడ్రస్ గా కరీంనగర్ ను మార్చిన మీకు అండగా ఉంటామంటున్నారు. కరీంనగరంతో పాటు నియోజకవర్గంలో అభివృద్దిని పరుగులు పెట్టించి నియోజకవర్గ రూపు రేఖలు మార్చిన నాయకుడు గంగుల కమలాకర్ అని ఆ వీడియోలో గ్రామస్తులు అన్నట్లు స్పష్టంగా ఉంది. మట్టి రోడ్డు లేని నియోజకవర్గంగా మార్చిన ఘనత గంగులదేనంటూ కొనియాడారు.