ఈ దాహం తీరనిది.. 

ఈ దాహం తీరనిది.. 

వాటర్ ప్లాంట్ ముందు క్యాన్ల క్యూ..

తడుక సుధాకర్, ముద్ర ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి: ఒకప్పుడు వేసవిలో కుళాయి నీళ్ల కోసం కుస్తీ పడేది.. కానీ ప్రస్తుతం మినరల్ వాటర్ కోసం జనం ఎగబడుతున్నారు. గత మూడు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండలకు ప్రజల దప్పిక తీరనిదిలా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ లో సోమవారం సాయంత్రం చల్లబడడంతో స్థానిక వాటర్ ప్లాంట్ వద్దకు ఒక్కసారిగా ప్రజలు తరలివచ్చి, మినరల్ వాటర్ కోసం క్యాన్లు తీసుకువచ్చి క్యూ లైన్లో పెట్టి వరుసక్రమంలో త్రాగునీరు పట్టుకెళ్లారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాన్లు క్యూ వరసలో పెట్టి పట్టుకెళ్లడం భానుడి ప్రతాపానికే త్రాగునీటి వాడకం పెరిగిందని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.