ఓకే గ్రామం నుండి ముగ్గురు కానిస్టేబుల్స్ గా ఎంపిక..

ఓకే గ్రామం నుండి ముగ్గురు కానిస్టేబుల్స్ గా ఎంపిక..

ముద్ర,గంభీరావుపేట:సన్నకారు రైతు కుటుంబంలు,వారికి వ్యవసాయం తప్ప,  ఏ పని ఎరగని కర్షకులు వారు, ఎనుకటి నుంచి వచ్చిన వ్యవసాయ భూమే ఆధారం.ఆ  కర్షకుల బిడ్డలు పోలీస్​ రిక్రూట్‌మెంట్​ బోర్డు బుధవారం ప్రకటించిన కానిస్టేబుల్  ఫలితాలలో  కానిస్టేబుల్స్ గా   ఎంపికయ్యారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట కీ చెందిన   ఆవుల నాగరాజు రెడ్డి ఇప్పటికే టీఎస్పీఎస్  బెటాలియన్ కానిస్టేబుల్ గా  విధులు నిర్వహిస్తుండగా,  ఇప్పుడు విలువడిన ఫలితాలలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు.  మెతుకు సంతోష్  గతంలో వెలుబడిన సింగరేణి రిక్రూమెంట్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాడు, ప్రస్తుత కానిస్టేబుల్ ఫలితాలలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా,  పాతూరి విక్రం సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక కా అయ్యారు.  ఒకే గ్రామం నుండి ముగ్గురు కానిస్టేబుల్ గా ఎంపిక కావడం పట్ల   గ్రామస్తులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.