సొంతగూటికి చేరుకున్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి తిరుపతమ్మ గౌడ్

సొంతగూటికి చేరుకున్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి తిరుపతమ్మ గౌడ్

ముద్ర/వీపనగండ్ల:- గత అసెంబ్లీ ఎన్నికల ముందు కొల్లాపూర్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం ప్రయత్నం చేసి టికెట్ రాకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి తిరుపతమ్మ గౌడ్, ఆమె భర్త కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మాజీ అధ్యక్షులు కృష్ణయ్య గౌడ్ లు కాంగ్రెస్ పార్టీలో సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం హైదరాబాదులోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎఐసిసి చేరికల కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఏఐసీసీ చేరికలు కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి లు తిరుపతమ్మ గౌడ్, కృష్ణయ్య గౌడ్ లకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుపతమ్మ గౌడ్ కృష్ణయ్య గౌడ్ లు మాట్లాడుతూ సొంత తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల ముందు వదులుకోవటం వల్ల ఎంతో మనస్థాపన చెందామని, మళ్లీ సొంత పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయానికి తమ శయా శక్తుల కృషి చేస్తామని వారన్నారు.