నేటి సత్యాగ్రహ దీక్ష వాయిదా

నేటి సత్యాగ్రహ దీక్ష వాయిదా

11 లేదా 12 ,15 తేదీల్లో సభ ఉండే చాన్స్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాలలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శనివారం జరగవలసిన సత్యాగ్రహ దీక్ష వాయిదా పడింది. రాహుల్ గాంధీ పై పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు చేయడాన్ని నిరసిస్తూ భట్టి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష సభ నస్పూర్ శివారులో ఏర్పాటు చేశారు. సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరుకావాల్సి ఉండే. అయితే అశోక్ గెహ్లాట్ కు సమయం కుదరకపోవడంతో సభ వాయిదా పడినట్లు తెలిసింది.

ఈనెల 11 లేదా 12 లేదా 15వ తేదీన సభ జరిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  అయితే సభ ఏర్పాట్లు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి. ఇదిలావుండగా భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా వాయిదా పడింది. సభ కోసం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. జైపూర్ మండలం దుబ్బపల్లి వరకు భట్టి పాదయాత్ర జరిగింది. సభ జరిగే వరకు భట్టి దుబ్బపల్లిలోనే మకాం ఉంటుంది. ప్రజలు, ఇతరులను భట్టి కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.