మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు నేడు తెలంగాణ రాష్ట్రం ఒక వేదిక: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు నేడు తెలంగాణ రాష్ట్రం ఒక వేదిక: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
MLA Pailla Shekhar Reddy

బీబీనగర్ (ముద్ర న్యూస్ ): తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలతో పాటు, ప్రజా ప్రతినిధులుగా, వ్యాపారవేత్తలుగా, సంఘసంస్కర్తలుగా మహిళలు రాణించేందుకు అన్ని విధాల బిఆర్ఎస్ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన వివరించారు. బీబీనగర్ మండలం నెమర గోముల గ్రామంలో విఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో  నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు ఘన సన్మానం చేశారు. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మౌంట్ నియర్ పడమటి అన్విత, తోపాటు, కార్యక్రమ నిర్వాహకులు బీబీనగర్ ఎంపీపీ ఎర్కలి సుధాకర్ గౌడ్, వివిధ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు అతిథులు బహుమతులు అందజేశారు.