కాచరాజు జయప్రకాష్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: నందిని సిధ్ధారెడ్డి

కాచరాజు జయప్రకాష్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: నందిని సిధ్ధారెడ్డి

రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు

ముద్ర ప్రతినిది, భువనగిరి: పోరాటాల పురిటి గడ్డ భువనగిరి ప్రాంతంలో ఎన్నో సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన కాచరాజు జయప్రకాష్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని , తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, రచయిత నందిని సిధ్ధారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి లోని ఎం ఎన్ ఆర్ గార్డెన్ లో జరిగిన కాచరాజు జయప్రకాష్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, తెలుగు భాషా రక్షణ ఉద్యమం లో కాచరాజు జయప్రకాష్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు.కవి పాత్ర సమాజంలో చాలా విలువైనదని,తన కలం ద్వారా ఒక ఊరును, ఒక పట్టణాన్ని, చివరకు సమాజాన్నే మార్చగలడని ఆయన అన్నారు. సాహితీ ప్రియునిగా కాచరాజు జయప్రకాష్ సమాజం లో సామాజిక రుగ్మతలను, రూపుమాపుటలో క్రియాశీలకంగా పనిచేసాడని ఆయన అన్నారు. గతంలో భువనగిరి ప్రాంతంలో జరిగిన వ్యభిచార వృత్తి నిర్మూలనకు కాచరాజు చేసిన ఉద్యమాలే నిదర్శనం అని ఆయన అన్నారు. సమావేశంలో మరో అతిథి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాచరాజు జయప్రకాష్ అందరివాడని, తలలో నాలుకలా కలిసి మెలిసి ఉండేవాడని ఆయన అన్నారు. కాచరాజు జయప్రకాష్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.

రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ కాచరాజు జయప్రకాష్ నిరంతరం సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేవాడని, నిర్భయంగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవి పరిష్కారం అయ్యేంతవరకు పోరాడే మనస్థత్వం గల కాచరాజు వ్యక్తి కాదని ఆయన ఒక శక్తి అని అన్నారు. లోక్ సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన సంతాప సమావేశంలో భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నాయకులు కాచరాజు జయప్రకాష్ మరణం తీరని లోటని, మంచి మిత్రున్ని కోల్పోయానని ఆయన అన్నారు. ఈ సంతాప సమావేశంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,డి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, టాప్రా రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగా అరుణ, సింగరాజు పల్లి ప్రధానోపాధ్యాయులు కళావతి, రిటైర్డ్ ఎం ఈ ఓ కంఠం చంద్రమోహన్, బండారు రవివర్ధన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం డి అతహర్,సి పి ఐ జిల్లా అధ్యక్షులు గోద శ్రీరాములు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, ఎస్ మల్లారెడ్డి, ఎస్ కే హమీద్ పాషా, శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అక్షింతల కృష్ణమూర్తి, పోలి శంకర్ రెడ్డి, జిట్టా భాస్కర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఉమామహేశ్వర్,టీ ఆర్ ఎస్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు, విశ్వేశ్వర్ రావు, వైజయంతి, రమేష్, ఇటికాల లావణ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు కోట స్వామి, పాశం శివానంద్, బండారు జయశ్రీ, ఎర్ర శివరాజ్, కే మల్లేశం,ఆవుల వినోద్, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, గోవింద్, మొయినుద్దీన్, బాలరాజు,బాలనర్సయ్య, చిన్నయ్య, బాలేశ్వర్, అంజయ్య,రాంబాయి, వనజ, వీరారెడ్డి, పురుషోత్తం రెడ్డి, చందుపట్ల సుజిత్, కాచరాజు సోదరుడు హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ కౌశిక్, కాచరాజు అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.