టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా గెల్లు శ్రీనివాస్
ముద్ర తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా... గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. అయితే గెల్లు శ్రీనివాస్ ఈటెల రాజేందర్పై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే!.