తహసీల్దార్ బదిలీ

తహసీల్దార్ బదిలీ

ముద్ర, లక్షేట్టిపేట : లక్షేట్టిపేట తహసీల్దార్ జ్యోత్స్నా సోమవారం లక్షేట్టిపేట నుండి మంచిర్యాల ఆర్ డి ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా బదిలీ కాగా డెప్యూటేషన్ పై కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించనునట్టు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేసారు. లక్షేట్టిపేట కంటే ముందు నస్పూర్ లో తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహించిన జ్యోత్స్నా 2022 ఫిబ్రవరి లో నస్పూర్ నుండి లక్షేట్టిపేట కు బదిలీ అయినారు. 2022 నుండి 2023 జులై వరకు మండలానికి సేవలు అందించారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న విజయనందం ని బదిలి పై లక్షేట్టిపేట నూతన తహసీల్దార్ గా జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేసారు. నూతన తహసీల్దార్ విజయనందం మంగళవారం విధులకు హాజరై బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.