రెండు బైక్ లు డీ..

రెండు బైక్ లు డీ..

ఒకరు మృతి..

మెట్‌పల్లి ముద్ర:- ఎదురు ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లాపూర్ మండలం రాఘవపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మెట్‌పల్లి పట్టణానికి చెందిన షేక్ అప్సర్ (34) మల్లాపూర్ నుండి మెట్‌పల్లి వైపు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మొగిలిపేటకు చెందిన దండ్ల సాయిలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పై మల్లాపూర్ వెళుతున్నాడు ఈ రెండు వాహనాలు రాఘవపేట పెట్రోల్ బంక్ వద్ద అతి వేగంతో  ఢీకొనగా షేక్ అప్సర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా. సాయిలు ను మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్సర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.