శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరి మృతి

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిజామాబాద్ జిల్లా శ్రీ రాం సాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ పడి ఇద్దరు మృతి చెందారు. ప్రాజెక్ట్ చూసేందుకు వచ్చిన సమయంలో స్నానం చేస్తూ మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో  నిర్మల్ కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఫహీం బైక్ మెకానిక్.  వయసు 30 సంవత్సరాలు. మరో వ్యక్తి మొహమ్మద్ బారక్ పూనాకు  చెందిన విద్యార్థి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.