కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ముద్ర.వీపనగండ్ల:-వీపనగండ్ల మండల పరిధిలోని పుల్గర్ చేర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని సీనియర్ నాయకులు నాగర్ల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గ్రామ పార్టి అధ్యక్షులు గా ఆలకుంట రాజు, ప్రధాన కార్యదర్శి గా బిజ్జ జగదీష్ , గౌరవ అధ్యక్షులుగా గురక కురుమయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా కరుణాకర్, నరసింహ, వెంకటేష్, రాజు తో పాటు మరో నలభై మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బిజ్జు నరేష్ కుమార్ ఉన్నారు.