వేములూరి వాగులోగుర్తు తెలియని మృతదేహం లభ్యం.

హుజూర్ నగర్, ముద్ర: హుజూర్ నగర్ మండలం సీతారామ పురం గ్రామ రెవెన్యూ పరిధిలోని వేములూరి వాగులో బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఒక గుర్తుతెలియని మగ మనిషి మూతదేహం చేపల వేటకు వెళ్లిన గంటసాల రామాంజనేయులు, ఊరుకొండ పెద్ద వెంకన్న లకు కనిపించగా అట్టి విషయం గ్రామ సర్పంచ్ సైదేశ్వరరావు తెలియజేశారు వెంటనే ఆయన హుజూర్నగర్ రెడ్డికి తెలియజేశారు. వెంటనే ఆయన సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  మృతుని వయస్సు అందజ 40 సం'లు , ఎత్తు 5 ఫీట్లు ఉంటుంది. మృతుడు చూడటానికి బెగ్గర్ ల కనిపిస్తున్నాడు. ఎవరైనా మృతుని వివరములు తెలిచిన ఎడల పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై వెంకట్ రెడ్డి కోరారు.