నిరుపయోగంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు – వృధా అయిన ప్రజాధనం

నిరుపయోగంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు  – వృధా అయిన ప్రజాధనం

ముద్ర.వనపర్తి:- గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పంచాయతీలో, మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాల నిర్మాణం అసమగ్రంగా గ్రామాలకు దూరంగా క్రీడలకు అనువుగాని చోట ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు వినియోగించుకునే పరిస్థితి లేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మండల అభివృద్ధి అధికారులు , మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ నిధులతో చిత్తశుద్ధి కోరవడి , నామమాత్రoగా, ఏర్పాటు చేయడంతో అటు యువకులకు క్రీడాకారులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా, నిరుపయోగంగా ఉన్నాయి.

క్రీడా ప్రాంగణంలో ఒక బోర్డు, ఒక హారిజంటల్ బారు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.ఏ గ్రామంలో చూసిన, మండల కేంద్రాలలో చూసిన, జిల్లా కేంద్రాలలో చూసిన క్రీడా ప్రాంగణంలను ఎక్కడ ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు.ఇప్పటికైనా మండల అభివృద్ధి అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధిపరిచి క్రీడలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తే, ప్రతిభగల క్రీడాకారులు ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని అనడంలో ఎలాంటి సందేహాo లేదు.