మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

ముద్ర.వనపర్తి:- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన  దత్తాయపల్లి గ్రామానికి చెందిన సాతర్ల గోవర్ధన్ (40)  కుటుంబాన్ని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘా రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా గోవర్ధన్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ తనను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు.గోవర్ధన్ మృతికి సంబంధించి ఇతర కారణాలు ఏవైనా ఉన్నా పూర్వాపురాలు పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చూస్తామని అన్నారు.మృతుడు గోవర్ధన్ కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, సీనియర్ నాయకులు గొల్ల వెంకటయ్య, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.