ఘ‌నంగా వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్యాణోత్స‌వం

ఘ‌నంగా వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్యాణోత్స‌వం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన   శ్రీదేవి భూదేవి సమేత స్వామి వార్లను  కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చి మంగళ వాయిద్యాలు, బాజా బజంత్రీలు, వేద బ్రాహ్మణుల మంత్రోత్సరణల మధ్య కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా, జగిత్యాల మాజీ చై ర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణలు  పట్టు వస్త్రాలు, మంగళ సూత్రాలు అందజేశారు.

ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అన్నా దానం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జితేందర్ రావ్, సర్పంచ్  గొడిసెల గంగాధర్, ఉపసర్పంచ్ పొగుల నారాయణ, ఆలయ కమిటీ చెర్మెన్ గోనెల బక్కన్న, వైస్ చెర్మెన్ ఊరేడి గంగాధర్, అడెపు సత్యం ఆలయ అధికారులు, భక్తులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.