కొండా విజయం ఖాయం - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 

కొండా విజయం ఖాయం -  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 

రంగారెడ్ది,ముద్ర: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం ఖాయమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు సోమవారం రంగారెడ్డి జిల్లా ఎన్నికల కేంద్రంలో విశేశ్వర్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ చేవెళ్ల నుండి బిజెపి అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తెలిపారు 10 సంవత్సరాలలో మోడీ సాధించిన అభివృద్ధి విజయానికి దోహదపడుతుందని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తన ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని విజయం తత్యం అని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, అంజలి శ్రీరాములు కేఎస్ రత్నం తదితరులు పాల్గొన్నారు