ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలి - ఎస్సై రవీంద్ర నాయక్

ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలి  - ఎస్సై రవీంద్ర నాయక్

ముద్ర న్యూస్ నేరేడుచర్ల:- నేరేడుచర్ల పట్టణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో  ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ఎస్సై రవీంద్ర నాయక్  పోలీస్, పారామిలటరీ దళాలతో కవాతు నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వేసినపుడే నిజమైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకొని చైతన్యంతో దానిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  పారామిలటరీ సిబ్బంది, స్థా నిక పోలీసులు పాల్గొన్నారు.