కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి

కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి

రామకృష్ణాపూర్, ముద్ర : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు,అగ్రిమెంట్ లోని అంశాలను తక్షణమే అమలు చేయాలని ఎస్.సి.కె.ఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాల పెంపుకై పోరు బాటలో భాగంగా ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం సంతా నుంచి మొదలైన ర్యాలీ సూపర్ బజార్, సివిల్ కార్యాలయం మీదుగా రాజీవ్ చౌక్ వరకు  చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవీ,లచ్చన్న,స్వరూప,రాజేశ్వరి,లక్ష్మీ,విజయ తదితరులు పాల్గొన్నారు.