ప్రభుత్వ ఆసుపత్రిలో కి నీళ్లు

ప్రభుత్వ ఆసుపత్రిలో కి నీళ్లు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ని రోగుల వార్డులోకి వరద వీరు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంకు ఆసుపత్రి కింద ఉన్న వార్డు లోకి ఒక్కసారిగా వర్షం నీరు చేరడంతో రోగులు భయపడ్డారు. వర్షం నీరు ఎక్కడ పెరుగుతుందోనని కలవరపడ్డారు. వార్డులో మందు లు నిలువ చేయగా నీళ్లకు తడవడంతో అప్రమత్తమైన సిబ్బంది వాటిని భద్రంగా మరోచోటుకు తరలించారు. వార్డులోకి వచ్చిన నీళ్లను బయటకు పంపి శుభ్రపరిచారు. అయితే విషయం తెలుకున్న కాంగ్రెస్ నేతలు వీడియోలు తీసి శోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అలాగే చాలు వార్డులలో మురికి కాలువలు నిండుకుని రోడ్ల పై ప్రవహించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.