టీఎస్ఆర్టీసీ బస్సులో రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్‌పై చెప్పుతో దాడి

టీఎస్ఆర్టీసీ బస్సులో రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్‌పై చెప్పుతో దాడి

ముద్ర,హైదరాబాద్:- రాజేంద్రనగర్‌లో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికురాలు బస్సు కండక్టర్ పై చెప్పు తీసుకొని చంపలు వాయించిన మహిళ. అడిగిన చోట బస్సు నిలుపలేదని ఆరోపిస్తూ కండక్టర్‌ను విచక్షణారహితంగా దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టిన వైనం. మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సులో ఘటన. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. దాడికి పాల్పడిన మహిళ శివరాంపల్లికి చెందిన ప్రసన్న గా గుర్తింపు.ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, ఆర్టీసీ సిబ్బంది సంస్థకు ఎనలేని సేవలు చేస్తున్నారని.. వారిపై దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. అయినా వారిపై దాడులు మాత్రం ఆగటం లేదు. రోజుకో చోట ఆర్టీసీ సిబ్బందిపై దాడులు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు కేసులు పెడుతున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయాణికులు మాత్రం విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు.