మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి -  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి -  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

ముద్ర, షాద్ నగర్:రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజక వర్గంలోని కొత్తూరు, షాద్ నగర్  మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చర్యలతో అభివృద్ధికి కృషి చేస్తామని స్ధానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంప్ కార్యాలయంలో కోత్తూరు మరియు షాద్ నగర్ మున్సిపాలిటి కమిషనర్లు వెంకన్న, వీరేందర్ తదితర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఏఈలు, డిఈలతో మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను గురించి చర్చిస్తూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీలలో ఆదర్శవంతమైనపరిపాలన అందించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు.

మున్సిపాలిటీలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు వాటికి సంబంధించిన ప్రగతి నివేదికను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇంకా చేపట్టబోయే పనులు పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాటిని వెంటనే తన దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు..