వైసీపీ ఓటమిని తట్టుకోలేక అభిమానుల మృతి...

వైసీపీ ఓటమిని తట్టుకోలేక అభిమానుల మృతి...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా (D) గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్ (28) జగన్ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి చెందడం తట్టుకోలేక ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. YSR(D) దిగువ తంబళ్లపల్లెకు చెందిన YCP కార్యకర్త చిన్నయల్లాలు(63) గుండెపోటుతో చనిపోయాడు. కర్నూలు(D) చిన్నతంబళంలోనూ ఉరుకుందప్ప (68) టీవీ చూస్తూ వైసీపీ ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచారు.

ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. 164కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ బొక్కబోర్లా పడింది. ఊహించని పరాజయంతో ఫలితాల పట్టికలో వైసీపీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. కేవలం 11 సీట్ల తో వైసీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.