అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. తరువాత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రుల ప్రమాణం తరువాత ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లేముందు సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ మోహన్ రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఇంగ్లీష్ ఆల్బాబెట్ ల ప్రకారం సభ్యులచే  ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.