పులివెందులలో వైఎస్ జగన్ విజయం...
![పులివెందులలో వైఎస్ జగన్ విజయం...](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_6643783d68607.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతోంది. అయితే కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప టీడీపీ అభ్యర్థిపై జగన్ 59వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అయితే వైసీపీ నుంచి గెలుపొందిన తొలి వ్యక్తి జగన్ కావడం విశేషం. ఇంకా 11 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.