యువత స్వయం ఉపాధితో ఎదగాలి

యువత స్వయం ఉపాధితో ఎదగాలి
  • మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ముంత మల్లయ్య


ముద్ర.వీపనగండ్ల:- నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఉన్నత స్థాయికి ఎదగాలని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు మాందాపురం ముంత మల్లయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గ్రామానికి చెందిన మదగని శివ ఏర్పాటు చేసుకున్న సప్లయర్స్ మరియు డెకరేషన్ షాప్ ను మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సమాన వృధా చేసుకోకుండా స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షించదగ్గ విషయమని, గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో సృజనాత్మక కొదవలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కర్ణాకర్ రెడ్డి, మహేష్, ముంత శివ తదితరులు ఉన్నారు.