బండలాగుడు పోటీలను ప్రారంభించిన జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

బండలాగుడు పోటీలను ప్రారంభించిన జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

ముద్ర, షాద్ నగర్: మహాశివరాత్రి పురస్కరించుకొని బండలాగుడు పోటీలను కేశంపేట జడ్పిటిసి సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ప్రారంభించారు. శనివారం కేశంపేట మండల పరిధిలోని అల్వాల, కొత్తపేట గ్రామాలలో ఎడ్ల పందాల బండలాగుడు పోటీలకు ముఖ్యఅతిథిగా జడ్పిటిసి సభ్యురాలు హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏడాది బండలాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. పోటీల్లో గెలుపోటములను సమానంగా భావిస్తూ ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనేందుకు కేశంపేట మండలం తో పాటు ఇతర ప్రాంతాల నుండి కాడెద్దులతో అన్నదాతలు ఇక్కడకు వస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయమని వివరించారు. ఈ కార్యక్రమంలో అలవాల ఎం పి టి సి సభ్యులు లంకాల సురేష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సుగుణమ్మ, కొత్తపేట మాజీ సర్పంచ్ జగదీష్ అప్ప తోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.