మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహశీల్ధార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలతో కొనసాగుతున్న సోదాలు. ఒక ట్రక్కు పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనట్టు సమాచారం. మహేందర్ రెడ్డి ఇంటిలో కిలోల కొద్ది బంగారు నగలు, భారీగా ఆస్తుల వివరాలు. అంతేకాదు మహేందర్ రెడ్డి కి సంబంధించిన 15 చోట్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. అంతే కాదు మర్రిగూడ ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా ఏసీబీ అధికారుల సోదాల నిర్వహణ.