గ్రామాలలో అభివృద్ధి చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

గ్రామాలలో అభివృద్ధి చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

తుంగతుర్తి ముద్ర: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సంగం గ్రామ సర్పంచ్ ఏశ మల్ల సుశీల సామెల్ అన్నారు. బుధవారం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  సహకారంతో CDP నిధుల నుండి 10లక్షల రూపాయలతో సంగెం నుండి కొత్త తండా ఫార్మేషన్ రోడ్డు పనులను ప్రారంభించారు., ఈ మేరకు ఆమె మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో గ్రామాలన్నీ అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కలకోట్ల ఎలేజర్ గారు , BRS మండల పార్టీ ఉపాధ్యక్షులు మల్యాల రాములు గారు , BRS నాయకులు ఏశమల్ల  సృజన్ కుమార్ గారు ,ఉపసర్పంచ్ జటంగి అనిత లింగయ్య గారు, వార్డ్ మెంబర్లు ఉప్పుల వెంకట్ రెడ్డి గారు , ఇరుగు నాగేష్ గారు , కాకులారపు మధుసూదన్ రెడ్డి గారు, కలకోట్ల మల్లేష్ గారు , కొణతం నాగిరెడ్డి గారు , గుంజ విజయ్ గారు , కాకులారపు రాంరెడ్డి గారు  , కాకులారపు వెంకటరెడ్డి గారు, మిడిదొడ్డి రామచంద్రు గారు ,వీరబోయిన మల్లయ్య  గారు  , శేట్ లింగయ్య గారు, తదితరులు పాల్గొన్నారు