అంబేద్కర్ సేవలు శ్లాఘనీయం - బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

అంబేద్కర్ సేవలు శ్లాఘనీయం - బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు అనితర సాధ్యమని, ఆయన కృషితో బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు సాధ్యమైందని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 133 జయంతిని పురస్కరించుకుని స్థానిక ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.

అనంతరం మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  అతి పేద కుటుంబంలో జన్మించినా విద్యాధికుడై రాజ్యాంగ రచనా కమిటీ బాధ్యతలు చేపట్టి ప్రపంచానికి ఆదర్శప్రాయం అయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఆదిలాబాద్ పార్లమెంటు కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు,దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, గాదే విలాస్, కుమ్మరి వెంకటేష్, చరణ్ మౌర్య, సంతోష్, జుట్టు రమేష్, మహేష్, లింగన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు .