ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనిల్ కుమార్ 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనిల్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట-రిటైర్డ్ ఐఏఎస్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం సూర్యాపేట పట్టణంలోని ikpటేకుమట్ల, ikp ఎండ్లపల్లి ,pacs ఎండ్లపల్లి,వజ్రా రైస్ మిల్, వజ్రా వికాస్ రైస్ మిల్లులను కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కేంద్రాలలో ఉన్న ధాన్యం తేమశాతాన్ని స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాల కారణంగా ధాన్యం ఎగుమతులు ,దిగుమతులలో జరుగుతున్న ఇబ్బందులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లకు ధాన్యం కొనుగోలు రవాణా దిగుమతి ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, జనరల్ మేజర్ రాజిరెడ్డి, డిఎం రాంపతి, డిఎస్ఓ పుల్లయ్య, తాసిల్దార్ ఎంకన్న, ఏపీఎం వెంకన్న ,వజ్రా రైస్ మిల్ యజమానులు వట్టే జానయ్య, మోరిసెట్టి శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.