నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఎంతో కాలంగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ(SGT) , 1264 టీజీటీ(TGT), 215 పీజీటీ(PGT), 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.