సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన సుమన్

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన సుమన్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఈనెల తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాలకు వస్తున్న సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  నస్పూర్ లో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, బీఆరెస్ జిల్లా పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలు , శంఖుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈసందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గత నాలుగు రోజుల నుంచి సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ. వెంకటేష్ నేత , కలెక్టర్ సంతోష్ ఇతర అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.