బండికి ప్రముఖుల పరామర్శ - ముగిసిన బండి సంజయ్ అత్తమ్మ అంత్యక్రియలు

బండికి ప్రముఖుల పరామర్శ  -  ముగిసిన బండి సంజయ్ అత్తమ్మ అంత్యక్రియలు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :బిజెపి రాష్ట్ర అధ్యక్షులు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం ఉదయం సంజయ్ అత్తమ్మ చిట్ల వనజ అనారోగ్యంతో మృతి చెందింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చిట్ల వనజ పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బండి దంపతులతో పాటు వారి అత్తమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గంగుల వెంట మేయర్ వై సునీల్ రావు, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, లు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, విజయశాంతి తో పాటు పలువురు ఫోన్లో పరామర్శించారు. బండి కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి.