నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్

నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గండ్ర నళిని,అడ్వకేట్ కరణ్ సింగ్  తో కలిసి ఈరోజు ఉదయం కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ పమేళా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

అనంతరం ఎస్ ఆర్ ఆర్ కళాశాల నుండి తెలంగాణ చౌక్ వరకు చేపట్టిన బైకు ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ర్యాలీ ప్రారంభించి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.