బండి సంజయ్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

బండి సంజయ్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ముద్ర లక్షేట్టిపేట్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  భారీ బహిరంగ సభను మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఐ బీ విశ్రాంత భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ..... భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రధాని మోడీ దశ దిశల వ్యాపింపజేస్తున్నారని కొనియాడారు.  బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిదని వివరించారు.మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా 12 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. ముఖ్యంగా  బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్థానిక ప్రజా సమస్యలపై మీటింగ్ లో మాట్లాడుతారని వివరించారు. ఒకప్పటి నియోజకవర్గంగా వెలుగొందిన లక్షేట్టిపేట్ ను పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. బీజేపీ తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు వీరమళ్ళ హరి గోపాల్,మండలాధ్యక్షుడు కిషన్, మీడియా ఇంచార్జ్ తుల ఆంజనేయులు,సీనియర్ నాయకులు వేముల మధు, ప్రభాకర్, రమేష్ చంద్ జైన్, నరేష్ చంద్ జైన్,గంగన్న,మోటపలుకుల సతీష్,సుధాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.