రాక్షస పాలనకు వ్యతిరేకంగ సీఎల్పీ నేత బట్టి పాదయాత్ర, కేవీపీ రామచందర్ రావు 

రాక్షస పాలనకు వ్యతిరేకంగ సీఎల్పీ నేత బట్టి పాదయాత్ర, కేవీపీ రామచందర్ రావు 

ముద్ర, జడ్చర్ల : కేంద్రంలో రాక్షస పాలన,రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలు కు వ్యతిరేఖంగా సీఎల్పీ లీడర్ మల్లు బట్టివిక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ లో ప్రజా స్వామిక పాలనకు మద్దతు ఇస్తున్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేవీపీ రామచందర్ రావు అన్నారు.శనివారం మహబూ బ్ నగర్ జిల్లా నవాబుపేట మండ లం రుక్కంపల్లి వద్ద ఆగి,విరామం తీసుకుంటున్న బట్టివిక్రమార్క ను కేవీపీ పరామర్శించారు.అనంతరం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. మోడీ ఆర్థిక విధానాలు పూర్తిగా పేదల బతుకులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని అన్నారు.ఈడీ, సీబీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పి అధికారం కోసం కుట్రలు చేస్తున్నదని తెలిపారు.అదే విధంగా రాష్టంలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో స్వర్గీయ వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర తరహాలోనే తాజాగా సీఎల్పీ నేత మల్లు బట్టివిక్రమార్క పాదయాత్ర కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యాలకు నిరసనగా వైఎస్సార్ పాదయాత్ర చేయగా,కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుంజుకొని వ్యాపారం చేస్తున్నదని,దీన్ని నిరసిస్తూ   సీఎల్పీ నేత బట్టివిక్రమార్క పాదయాత్ర చేయడం శిభపరిణామమని అన్నారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఉన్నారు.