బీసీల రాజకీయ ప్లీనరీ మహాసభ గోడపత్రిక విడుదల
![బీసీల రాజకీయ ప్లీనరీ మహాసభ గోడపత్రిక విడుదల](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64ae6c5e01ecd.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి : ఈనెల 15న హైదరాబాదులో జరగబోయే బీసీల రాజకీయ ప్లీనరీ మహాసభ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు కొత్త నరసింహ స్వామి పిలుపునిచ్చారు. బుధవారం యాదాద్రి బోనగిరి జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదురి అచ్చయ్య, భువనగిరి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ మాయ దశరథ గారు, భువనగిరి నియోజకవర్గం బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సాబన్ కార్ వెంకటేష్, గాజుల క్రాంతి కుమార్, సురేష్ యాదవ్, కూర శివకుమార్, సత్యనారాయణ, కృష్ణ, రమేష్, బీసీ నాయకులు పాల్గొన్నారు.