సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ | Mudra News

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ | Mudra News

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లా పానగల్ మండలంలో SGF (ప్రత్యేక నిధులు) నిధులతో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఎంపీపీ మామిల్లపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని శాగాపూర్ తండాలో 20 లక్షల నిధులతో  సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను నిబందనల ప్రకారంగా, నాణ్యవంతంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు, గ్రామ సర్పంచ్ హేములమ్మ, చిక్కేపల్లి సర్పంచ్ బాలస్వామి, బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్ర శేకర్ నాయక్, నాయకులు శంకర్ నాయక్, రమేష్ నాయక్, నిరంజన్ నాయక్, సహదేవ్ నాయక్, మోహన్, శంకర్, రవీందర్, సహదేవుడు , బాలు, బలరామ్ పంచాయతీ కార్యదర్శి పరశురాం, తదితరులు పాల్గొన్నారు.