టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో పెద్ద తలకాయలను తప్పించారు
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై బేగం బజారు పీఎస్లో వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పెద్ద తలకాయలను తప్పించారని అన్నారు. పేపర్ లీకేజీ రాష్ట్ర భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి సిస్టమ్కు ఐటీ శాఖ బాధ్యత వహించాలన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దన్నారు. ఈ ఘటనకు ఐటీ శాఖ మంత్రి బాధ్యత వహించాలని అన్నారు.